ముద్రగడ పద్మనాభం విగ్రహ ఏర్పాటుకు ఆర్డీవోకు వినతి
1 min read
స్థలం వివరాలు అందజేసిన పొలమూరి మోహన్ బాబు
అమలాపురం, న్యూస్ నేడు : మాజీ మంత్రి, దివంగత ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ పొలమూరి మోహన్ బాబు గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)ను కలిసి వినతిపత్రం అందజేశారు.స్థలం.అమలాపురంలోని కాటన్ పార్కులో, ఎంఆర్ఓ కార్యాలయానికి ఎదురుగా ఉన్న మదర్ థెరిసా విగ్రహం పక్కన ఉన్న స్థలాన్ని ముద్రగడ పద్మనాభం విగ్రహ ఏర్పాటుకు కేటాయించాలని మోహన్ బాబు ఆర్డీవోను కోరారు.ఈ విషయంపై ఆర్డీవో సానుకూలంగా స్పందిస్తూ, వీలైనంత త్వరగా స్థలం మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మోహన్ బాబు తెలిపారు.


