ఈనెల 24న భారత ఉప రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని పర్యవేక్షణ
1 min read
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఏలూరు రేంజ్ ఐ.జి.జి.వి.జి. అశోక్ కుమార్,జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి , ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈనెల 24వ తేదీ నాడు పర్యటన ఏర్పాట్లపై అధికారుల కాట్రేనిపాడు గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినారు. భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన పురస్కరించుకొని పర్యవేక్షించిన ఏలూరు రేంజ్ ఐ.జి.జి.వి.జి. అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి,ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్,ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై. ప్రసాదరావు, ఏ.ఆర్. అదనపు ఎస్పీ జి. మునిరాజా, నూజివీడు డి.ఎస్.పి.కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మరియు నూజివీడు సబ్ కలెక్టర్ ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు తదితర ఉన్నతాధికారులు.అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన మరియు భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వ మరియు పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తమైందని.ఇందులో భాగంగా రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉన్నతాధికారులందరూ కలిసి కాట్రేనిపాడులోని పర్యటన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు.


