జాతీయ సమైక్యతా దినోత్సవం – సద్భావనా దినోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆగస్టు 20న దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవం, సద్భావనా దినోత్సవాన్ని నిర్వహిస్తారనిదేశ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం అని సామాజిక వివక్ష, ద్వేషం, హింసకు దూరంగా ఉంటూ శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,దేశ అభివృద్ధి కోసం పరస్పర సహకారం, సామరస్యం, మానవతా విలువలను ఆచరించాలని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్, లయన్స్ జిల్లా చైర్ పర్సన్ లయన్ అంబాసిడర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, వివిధ పాఠశాలలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


