49 బన్నూర్’లో యువకుడు అదృశ్యం
1 min read
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో యువకుడు అదృశ్యమైనట్లు మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ మంగళవారం తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన షేక్ చాంద్ బాష,ఉశేనాబీ దంపతుల కుమారుడు షేక్ సుకుర్ భాష(25) అనే యువకుడు గత నెల ఆగస్టు 15వ తేదీ నుండి కనబడడం లేదని ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బంధువుల దగ్గర విచారించినా ఆచూకీ లేదన్నారు.తండ్రి చాంద్ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.


