PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బద్వేల్​ ఉప ఎన్నిక నుంచి టీడీపీ నిష్ర్కమణ!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: కడప జిల్లా బద్వేల్​ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నుంచి టీడీపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం జరిగిన పొలిట్​బ్యూరో సమావేశంలో అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్​ను ప్రకటించిన టీడీపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే దివంగత వెంకటసుబ్బయ్య పట్ల అనుభూతిని పరిగణలోకి తీసుకుని ఆయన సతీమణి డాక్టర్​ సుధా ఎంపిక మద్దతుగా ఉప ఎన్నిక నుంచి వైదొలగడం విశేషం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బద్వేల్​ ఎన్నికను ఏకగ్రీవం అయ్యేందుకు అన్నిపార్టీలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్​కళ్యాణ్​ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలపడం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో టీడీపీ సైతం అదే బాటలో పోటీనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాగా బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు బద్వేల్​ బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు.

About Author