PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్ణాట‌క వాహ‌నాల పై మ‌హారాష్ట్ర‌లో దాడులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల మ‌ధ్య వివాదం రాజుకుంది. మ‌హారాష్ట్ర వెళ్లిన క‌ర్ణాట‌క బస్సుల పై శివ‌సేన‌, ఎంఈఎస్ కార్య‌క‌ర్త‌లు దాడులు చేశారు. కన్నడిగులకు చెందిన దుకాణాలను బలవంతంగా మూయించారు. దీంతో పలు చోట్ల ఉద్రి క్త వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని సాంకీ ట్యాంకు రోడ్డు వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి మసిపూసి అవమానించడంతోనే వారు వీరంగం చేసినట్టు తెలుస్తోంది. శివసేన, ఎంఈఎస్‌ కార్యకర్తల దాడిలో పలు బస్సులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. సాంగ్లి పట్టణంలో 50ు మంది కన్నడిగులు నివసిస్తుంటారు. ఇక్కడి దుకాణాల బోర్డులు కూడా కన్నడలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించి ధ్వం సం చేశారు. బెళగావిలోని ఆనగోళ కనకదాస కాలనీలో తెల్లవారుజామున 3 గంటలకు సంగొళ్లిరాయణ్ణ విగ్రహాన్ని అవమానించేందుకు కొందరు యత్నించారు.

                                        
                  

About Author