PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎంను చంపుతానన్న వ్యక్తి.. విడుదల చేయమన్న న్యాయమూర్తి !

1 min read

పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ మోహన్ రెడ్డిని మానవబాంబై చంపుతానని సోషల్ మీడియలో పోస్ట్ చేసిన రాజుపాలెపు పవన్ ఫణి పై నమోదు చేసిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. నిందితుడిపై మోపిన 121, 124ఏ రాజద్రోహంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్లు బనాయించారని, అవి ఈ కేసుకు వర్తించవని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫణిని గుంటూరులోని సీఐడీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నివేదిక పరిశీలించిన న్యాయమూర్తి అతని పై నమోద చేసిన నేరాలు సరిగా లేవని, మరికొన్ని ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడికి నోటీసులు ఇచ్చి సొంత పూచీకత్తు పై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఫణిని విడిచిపెట్టారు.

    

About Author