PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలో చేరిన అరోరా న‌గ‌ర్ వాసులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  న‌గ‌రంలోని అరోరా న‌గ‌ర్‌కు చెందిన ప‌లు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. శ‌నివారం మౌర్య ఇన్‌లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో వీరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూల్లో టి.జి భ‌ర‌త్ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డ‌తామ‌ని వీరు చెప్పారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్ర‌జ‌లంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంది, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీలో చేరిన వారంద‌రూ క్షేత్ర స్థాయిలో ప‌నిచేసి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావాల‌ని ఆయ‌న కోరారు. టిడిపి నేత బాలు ఆధ్వ‌ర్వంలో వీర‌య్య‌, ఓబులేష్‌, రాము, హరి, ఆంజ‌నేయులు, మ‌ల్లి, ర‌క్షిత్‌, రోషి, ప‌వ‌న్‌, రాజు, ప్ర‌దీప్‌లు పార్టీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత సూర్య‌నారాయ‌ణ‌, త‌దిత‌రులు ఉన్నారు.

About Author