వికసిత ఏపీ లక్ష్య సాధనలో ఉన్న మోదీ కి కర్నూలు ప్రజల స్వాగతం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అక్టోబర్ 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీశైలం వెళ్లి జ్యోతిర్లింగ శివక్షేత్రంలో దర్శనం చేసుకుంటారు. అనంతరం కర్నూలులో ప్రజాసభలో పాల్గొననున్నారు.మోదీ ప్రభుత్వం గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేష కృషి చేసింది. కేంద్రం పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్యా, కనెక్టివిటీ రంగాలలో పెట్టుబడులు చేసింది.కర్నూలు పరిసర ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలుఒర్వకల్ నోడ్ను బెంగళూరు–చెన్నై ఎకానమిక్ కారిడార్ కింద ప్రధాన పరిశ్రమల హబ్గా అభివృద్ధి చేస్తున్నారు.ఆసియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ సౌర–గాలి–హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ కర్నూలులో విజయవంతంగా కొనసాగుతోంది.డీఆర్డీఓ డ్రోన్ టెస్టింగ్ సెంటర్ కర్నూలులో సక్రియంగా ఉంది. త్వరలో డ్రోన్ తయారీ కేంద్రం కూడా ఏర్పడుతుంది.

