PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బదిలీపై వెళ్లిన ఆసుపత్రి సిబ్బందికి ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు విధులు నిర్వహిస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ లు ఏడు మంది, హెల్త్ అసిస్టెంట్లు ముగ్గురు బదిలీపై వెళ్లగా వారిని డాక్టర్ రజిని మరియు హెడ్ నర్స్ లక్ష్మీనరసమ్మ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఇప్పటివరకు డి డి వో గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామిరెడ్డి ఆస్పరి పిహెచ్సి కి వెళ్ళగా, ఆయన స్థానంలో డాక్టర్ రంగ రవళి కి నూతన డి డి ఓ గా బాధ్యతలు అప్పగించినట్లు డాక్టర్ రజని తెలిపారు. అనంతరం డి డి వో గా నూతన బాధ్యతలు చేపట్టిన రంగ రవళి, డాక్టర్ రజిని లు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన స్టాఫ్ నర్సులు హెల్త్ అసిస్టెంట్లు ప్రజలకు మంచి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్స్ సిబ్బంది హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

About Author