PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేలానికి కేకు ముక్క.. రూ. 27 వేలతో ప్రారంభం !

1 min read

పల్లెవెలుగువెబ్ : బ్రిటన్ రాజుగా ఇటీవల పగ్గాలు చేపట్టిన కింగ్ చార్లెస్ III, యువరాణి డయానా దంపతుల వివాహం నాటి కేకు ముక్క వేలానికి సిద్ధమైంది. 1981లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన వారిలో నిగెల్ రికెట్స్ గతేడాది మరణించారు. ఆయనకు సంబంధించి తాజాగా ఓ విషయం బయటపడింది. కింగ్ చార్లెస్ వివాహానికి హాజరైన ఆయన ఆ సందర్భంగా కట్ చేసిన కేకు ముక్కను 41 ఏళ్లుగా భద్రపరిచారు. ఇప్పుడీ కేకు ముక్కను వేలం వేయాలని డోర్ అండీ రీస్ సంస్థ నిర్ణయించింది. వేలం 300 పౌండ్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 27 వేలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

About Author