PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ అధికారిని.. వ్యాన్ తో తొక్కించి చంపేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జార్ఖండ్‌ రాజధాని రాంచీ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను వ్యాన్‌తో తొక్కించి హత్య చేశారు. బుధవారం వేకువజామున 2.30గంటల ప్రాంతంలో రాంచీ శివార్లలోని తుపుదానా ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పశువుల అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ సంధ్య తోప్నో(32) చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఆమె ఉన్నవైపుగా స్మగ్లర్లు ఉన్న పికప్‌ వ్యాన్‌ దూసుకొచ్చింది. అనుమానాస్పదంగా వస్తున్న ఆ వాహనాన్ని ఆపాలని సంధ్య సిగ్నల్‌ ఇచ్చినా పట్టించుకోకుండా డ్రైవర్‌ అతివేగంగా పోనిచ్చి ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. సమీపంలోని రింగురోడ్డుపై వ్యాన్‌ బోల్తా పడింది. స్మగ్లర్లు తప్పించుకోగా, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన సంధ్యను రాంచీలోని రిమ్స్‌కు తరలించగా అప్పటికే ఆ మె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు.

                                     

About Author