PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతిభ కనబరిచిన పెద్ద నెలటూరు విద్యార్థిని

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో గొనెగండ్ల మండల పరిధిలోని పెద్ద నెలటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని హేమలత తన సత్తాను చాటి ప్రతిభను చూపినట్లు పాఠశాల ఉపాధ్యాయురాలు పిడిఎస్ రసూల్ బి తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన 66వ అండర్ 17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో హేమలత రాణించి జట్టు ద్వితీయ స్థానంలో నిలవడానికి కృషి చేసిందని అన్నారు. విద్యార్థిని హేమలతను శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను అభినందించారు.

About Author