PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగు పడి యువకుడు మృతి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ పొలిమేరలో పగిడ్యాల సమీపంలోని నల్లవాగు పొలాలలో విష్ణు (18) అనే యువకుడు గొర్రెలు కాస్తుండగా పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు.సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగు పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ తాలూకా వీపనగండ్ల మండలం తూముకుంటా బొల్లవరం గ్రామానికి చెందిన ఆవుల నాగేంద్ర కు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు. బ్రతుకు దేరువు కోసం గొర్రెల కాపరిగా ఇక్కడికి వచ్చారు. ఇంటర్ చదువుతున్న కుమారుడు విష్ణును తోడుగా తెచ్చుకున్నాడు.గాలి వాన బీభత్సం తో తల దాచుకునేందుకు సమీపంలోని చెట్టు కిందకు వెళ్ళాడు. విధి చిన్నచూపు చూసింది. మృత్యువు పిడుగు రూపంలో కబలించింది. కుమారుడు మరణ వార్త విన్న ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత కొంత కాలంగా భార్య మృతి చెందిన కుమారుడిని చూసుకుని బ్రతుకుతున్నానని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ను చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పలువురి కళ్ళు చెమ్మగిల్లాయి.

About Author