PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారతదేశ ఖ్యాతిని చాటిన మహనీయుడు అబ్దుల్ కలాం

1 min read

– ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శమూర్తి అని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సోమవారం రాయచోటి పట్టణంలోని జాతీయ రహదారిపై యూసుఫ్ షా ఖాద్రీ దర్గా సర్కిల్ లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి ఏ పి జె అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరంగానూ, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయ మన్నారు.సామాన్య కుటుంభంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప ప్రజ్ఞాశాలి అని అన్నారు.రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలోనూ ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శనీయులుగా నిలిచారన్నారు. కలలను సాకారం చేసుకోమంటూ విద్యార్థి లోకాన్ని తట్టిలేపారన్నారు. అబ్దుల్ కలాం బాటలో విద్యార్థులు, యువత నడవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. దేశవిదేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటిన మహనీయుడు కలాం అని శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు.

About Author