PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిస్వార్థ ప్రజా సేవకుడు అచ్చన్నాయుడు

1 min read

– తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజవరపు అచ్చన్నాయుడు నిస్వార్థ ప్రజా సేవకుడు ఆని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు, అచ్చన్నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ కమలాపురం నియోజక వర్గం లోని కమలాపురం, చెన్నూరు లారెన్స్ ఉద్దేశ్రమంలో, పెండ్లిమర్రి చింతకొమ్మదిన్నే ,వల్లూరు, వీరపునాయుని పల్లి ,మండలాలలో కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరుపేదలకు ఆపిల్ పండ్లు, బ్రెడ్ లు పంచిపెట్టారు, ఈ సందర్భంగా కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రం లో అపజయం ఎరుగని దీరో ధాత్తుడు అచ్చం నాయుడు ఆని ఆయన అన్నారు , తెలుగు దేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కి వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు మనో ధైర్యం, ఇవ్వడమే కాకుండా వాళ్లలో ఆత్మస్థైర్యం నింపి పార్టీ పూర్వవైభవానికి కృషి చేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా పార్టీలో అన్ని వర్గాల నాయకులను కుంటూ పోతు పార్టీని మరింత బలోపితం చేసేందుకు కృషి చేస్తున్న గొప్ప నాయకుడు అచ్చం న్నాయుడు అని ఆయన కొనియాడారు. ప్రజా సేవకుడిగా అను నిత్యం ప్రజల సంక్షేమం కొసం పని చేసే మహోన్నత వ్యక్తీ అచ్చం న్నాయుదు అని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, జనార్దన్ రెడ్డి, బరకం శంకరయ్య, రాజారెడ్డి, వెంకట కుమార్ రెడ్డి, చంగా బ్రహ్మయ్య,, పల్లా శ్రీనివాసులు , బరకం శివ ప్రసాద్, జమాల్ భాష తదితరులు పాల్గొన్నారు.

About Author