యోగాలో ఆక్యుప్రెజర్ అక్యూపంక్చర్ ను కలపాలి
1 min read
యోగ శక్తి సాధనా సమితి
గుంటూరు, న్యూస్ నేడు: 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా జూన్ 21వ తేదీన గుంటూరు జిల్లా లోని నల్లపాడు ఎంబిటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో జరిగిన ఉత్సవాలను కాలేజీ ప్రిన్సిపాల్ తాళ్లూరి శేఖర్ ప్రారంభించి యోగాంద్రా తో ఆరోగ్యాంధ్ర ఏర్పడిందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.యోగ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ విద్యార్థులకు ఉద్యోగులకు యోగ మరియు ఆక్యుప్రెషర్ సమ్మేళ్లిత మైన మోడీ ఫిట్నెస్ మంత్ర పై అవగాహన కలిగించారు.ఎవరైతే నిరంతర సాధన చేస్తారు వారు ఎలాంటి అనారోగ్యం లేకుండా పరిపూర్ణ జీవితం గడప కలుగుతారని తెలిపారు.అంతర్జాతీయంగా ఆక్యు ప్రెషర్ ఆక్యుపంక్చర్ మరియు అనేక ఇతర పేర్ల మీద వాడబడుతున్న యోగ ప్రాణమయ కోశా విధానాలను యోగాకు చేర్చి యోగాకు పూర్వ దశ వచ్చేలాగా చేయవలసిందిగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ కోరారు.ఈ యోగ ప్రాణమయ కోశ పెంచటానికి నూతన కాలేజీలు,పరిశోధనా కేంద్రాలు వాటికి కావలసిన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి,ప్రభుత్వ అన్ని హాస్పిటల్స్ లో వీటి సౌకర్యం పెంచి యోగ ఆరోగ్యం ప్రజలకు మరింత చేరువు చేయవలసిందిగా కోరడమైనది.అలా చేయడం ద్వారా ఇప్పుడు ఆరోగ్య రంగం మీద పెడుతున్న ఖర్చు తగ్గుతుందని తెలిపారు. చెవులకు పెట్టుకునే రింగులు అతి ప్రాచీనకాల అక్యూ పంక్చర్ అని,ఆభరణాలన్నీ ఆక్యు ప్రెషర్ సాధనాలని అని తెలిపి,వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని,వీటి సైన్స్ యోగాతో జత చేయడం వల్ల యోగ బలపడుతుంది అని తెలిపారు.కాలేజీ విద్యార్థులకు,ఉద్యోగాలకు మోడీ హెల్త్ కేర్ స్టిక్స్లు పంచి వాటిని వాడుకునే విధం తెలిపారు.ముఖ్యఅతిథి డాక్టర్ మాకాల సత్యనారాయణ ను కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. వైస్ ప్రిన్సిపాల్ సురేష్ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు.
