PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్నాళ్లు అన్నీ షేర్ చేసుకున్నారు.. ఇప్పుడు భ‌ర్త‌ను కూడ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ గా మారింది. ఈ పోస్టును కొంద‌రు స‌పోర్ట్ చేస్తుంటే.. మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అస‌లు ఆ పోస్టు ఏంటంటే.. మలేషియాకు చెందిన ఫాతిమా అజ్రాహ్ (31), ఫాతిమా అక్మా(27) ఇద్దరికి కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మారింది. దీంతో ఇద్దరూ ఒకరి విషయాలను మరొకరితో చెప్పుకునేవారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. తాజాగా ఈ ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌లో ప్రకటన కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసిన ఈ ఇద్దరూ.. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ ప్రపోజల్ నచ్చితే తమను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. అంతేకాకుండా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

                                 

About Author