PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్న రాఖీ క‌ట్టించుకోలేద‌ని చెల్లెలు ఆత్మహ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అన్న రాఖీ క‌ట్టించుకోలేద‌ని మ‌న‌స్థాపంతో ఓ చెల్లెలు ఆత్మహ‌త్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ లో ఘ‌ట‌న జ‌రిగింది. జ‌హీరాబాద్ లోని మాణిక్ ప్రభు వీధిలో బొగ్గుల మ‌మ‌త త‌ల్లిదండ్రులు, అన్నయ్యతో క‌లిసి నివాసం ఉంటున్నారు. మ‌మ‌త‌కు ఇద్దరు అన్నయ్యలు కాగా.. ఒక‌రు వేరు కాపురం ఉంటున్నారు. త‌ల్లిదండ్రల‌తో పాటు మ‌మ‌త, చిన్న అన్నయ్య ర‌మేష్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాఖీ పండుగ సంద‌ర్భంగా రాఖీ క‌ట్టించుకోమ‌ని చిన్న అన్నయ్య ర‌మేష్ ను కోరింది. కానీ రాఖీ క‌ట్టించుకునేందుకు ర‌మేష్ నిరాక‌రించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయ‌లేదు. అప్పటికే మ‌మ‌త త‌ల్లిదండ్రులు ప‌నుల నిమిత్తం బ‌య‌టికి వెళ్లారు. దీంతో మ‌మ‌త వెంట‌నే ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహ‌త్య చేసుకుంది. స్థానికులు క‌థ‌నం మేర‌కు గ‌త కొన్నిరోజులుగా ఇంట్లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఈ క్రమంలోనే అన్నాచెళ్లెల్ల మ‌ధ్య మ‌న‌స్పర్థలు ఏర్పడి ఉంటాయ‌ని చెబుతున్నారు. కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author