PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌రో ముప్పై ఏళ్లు .. జ‌గ‌నే సీఎం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రజల అభీష్టం మేరకు మరో మూడు దశ బ్ధాల పాటు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుంటూరులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత లోకేష్‌ సైకిల్‌ యాత్ర వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రతిపక్ష నాయకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాలన అందించడం వల్లే టీడీపీ నాయకులకు ఈ గతి పట్టిందన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్రల వల్ల, బస్సు యాత్రల వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి జోస్యం చెప్పారు.

                                   

About Author