PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ అసెంబ్లీ.. టీడీపీ స‌భ్యులు స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సోమవారం ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. ఏపీలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ వేశారు. మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి బడ్జెట్‌ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే తాము అడిగింది ప్రజా సమస్య అని.. దానిపై చర్చించమని అడిగితే సస్పెన్షన్ చేయడం ఎంతవరకూ సమంజమసమని స్పీకర్ పోడియం చుట్టుముట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు కదలకపోవడంతో వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు.

                                           

About Author