NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ని కలిసిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు

1 min read

మంత్రికి పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేత

సానుకూలంగా స్పందించిన మంత్రి వీరాంజనేయ స్వామి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ గ్రామ,వార్డ్ సచివాలయ శాఖా మంత్రి  డోలా బాల వీరాంజనేయ స్వామిని మర్యాద పూర్వకంగా కల్సిన రాష్ట్ర ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి డివి రమణ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు కలిశారు. ఉద్యోగుల,పెన్షనర్ల, గ్రామ వార్డు, సచివాలయాల కు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించరని. ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానట్లు  తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి పెంచలరావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు,రాష్ట్ర గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జానీ పాషా,ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు,మరియు ఎన్జీజివోస్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి  పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు ఇచ్చి సచివాలయ ఉద్యోగుల కు సంబంధించిన బదలీలకు ఇచ్చిన పలు ఉత్తర్వులు లో మార్పులు కోరినట్లు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *