కారుణ్య నియామకాల కింద 50 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
1 min read
నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కలెక్టర్
కర్నూలు, న్యూస్ నేడు: కారుణ్య నియామకాల కింద 50 మందికి జూనియర్ అసిస్టెంట్ లుగా ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్& ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లుగా 05 మందికి, పంచాయతీ సెక్రెటరీ Gr VI లుగా 04 (నలుగురికి), వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లు గా 09 మందికి, మహిళా పోలీస్ గా 01(ఒక్కరికి), రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ లుగా 05 మందికి, వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్లు గా 26 మందికి మొత్తం 50 మందికి జిల్లా కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు..ఇది మంచి అవకాశం అని, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగాలు పొందిన వారంతా మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులుగా ఎదిగే అవకాశం ఉందని, ఇప్పటినుంచే అన్ని అంశాలను నేర్చుకుని, కెరీర్ ను డెవలప్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..డిఆర్ఓ, ఏఓలను అభినందించిన కలెక్టర్50 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక పత్రాలు అందచేసినందుకు కలెక్టర్ డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఏఓ విజయశ్రీ లను అభినందించారు.. ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం చిన్న విషయం కాదని, ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు కలెక్టర్ వారికి అభినందనలు తెలియచేశారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపడం వల్ల తమకు ఉద్యోగ నియామకం జరిగిందని అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.సమావేశం లో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ ఏవో విజయశ్రీ, సంబంధిత సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.
