PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం ఇక‌లేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ సాయుధ‌పోరాట యోధురాలు, సీపీఎం సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) ఇకలేరు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

                                    

About Author