శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఘనంగా స్వర్ణరథోత్సవం
1 min read
న్యూస్ నేడు శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం వారు స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. వర్షం కారణంగా గ్రామోత్సవం రద్దు చేయడం జరిగింది భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు,గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు,భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీస్వామి అమ్మవారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు అయితే ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈస్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు.

