PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ ఎన్నికలు అయిపోగానే.. పెట్రోల్, డీజిల్ మ‌ళ్లీ పెంచుతారు !

1 min read

పల్లెవెలుగు వెబ్​:కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌డం పై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాద‌వ్ స్పందించారు. ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌గానే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతార‌ని అన్నారు. దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఉపఎన్నిక‌ల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని చెప్పారు. యూపీ ఎన్నిక‌ల్లో కూడ ఇదే ఫ‌లితం పున‌రావృతమవుతుందన్నారు. ఈ ఫలితాల‌ను తిరిగి పున‌రావృతం కాకుండా చూసుకునేందుకే బీజేపీ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించింద‌న్నారు. యూపీ ఎన్నిక‌లు ముగియ‌గానే మ‌ళ్లీ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచుతార‌ని చెప్పారు. బీజేపీకి చిత్తు శుద్ధి ఉంటే 50 రూపాయాలు త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు.

About Author