PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ‌కూర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరగనుంది. ఈ నెల 26న ఫలితాలు వెలువడుతాయి. మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక అనివార్య‌మైంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.

                                                     

About Author