PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎద్దుల దొడ్డిలో దారుణం… వివాహితపై  సామూహిక అత్యాచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గo, తుగ్గలి మండలంలోని ఎద్దుల దొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన  చోటుచేసుకుంది. ఈ మేరకు బాధిత మహిళ తుగ్గలి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎద్దుల దొడ్డి గ్రామానికి చెందిన ఈడిగ ఉపేందర్, బోయ రామానాయుడు అనే వ్యక్తులు తనను లోబర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారని, తాను లొంగక పోవడంతో బలవంతంగా ఇంటిలోకి ఎత్తుకెళ్లి తనపై దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి చేయడమే కాక ఇద్దరు వ్యక్తులు తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఫిర్యాదులో తెలిపింది. తనపై దాడికి పాల్పడి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుగ్గలి పోలీస్ స్టేషన్లో ఎద్దుల దొడ్డికి చెందిన ఇద్దరు నిందితులు ఈడిగ ఉపేంద్ర, బోయ రామానాయుడులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై బాలిక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

About Author