PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీడీవో కార్యాలయంలోని దుకాణాలకు వేలంపాట

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో నూతనముగా నిర్మించిన రెండు షాపులను వేలంపాట ద్వారా బాడుగకు ఇచ్చేందుకు ఈ నెల 31 న వేలంపాట నిర్వహిస్తున్నట్లు నందికొట్కూరు మండల అభివృద్ధి అధికారి శోభారాణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. నందికొట్కూరు మండల ప్రజా పరిషత్తు ఆవరణలో నిర్మించిన 2 వాణిజ్య సముదాయములను వేలము నిర్వహించి బాడుగకు ఇచ్చుటకు నిర్ణయించడమైనదన్నారు. ఆసక్తిగల వారు వేలములో పాల్గొనుటకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందికొట్కూరు వారి పేరిట డి డి. తీసి 31 సాయంత్రము 4 గంటల లోపు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సమర్పించి తమ పేరును రిజిస్టరు చేసుకొనవలయును తెలిపారు . 1 తేదీ మధ్యాహ్నము 3.30 గంటలకు వేలము నిర్వహించబడునని ఆమె తెలిపారు.

About Author