NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా కోర్టు లో  న్యాయ సేవ సదస్సు హాల్ నందు  న్యాయ విజ్ఞాన వేదిక బాల్యవివాహాలపై అవగాహన సదస్సు డిస్ట్రిక్ట్ లీగల్చల్ సెక్రటరీ అయినా జడ్జ్ శేషాద్రి  ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఇందులో ఐసీడీఎస్ శాఖ శ్రీమతి శారద ,  వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ శ్రీమతి ఉమా దేవి  మహిళ   పోలీసు స్టేషన్ si కిరణ్ కుమార్         కర్నూల్ నగర  బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండే చంద్రశేఖర్ మరియు ఉపాధ్యక్షుడు కంచుగంటల శ్యాంసుందర్   సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ  మరియు అఖిలభారత బ్రాహ్మణ సంక్షేమ రాష్ట్ర కోఆర్డినేటర్ దేవుళ్ళ వసంత సాయికుమార్ శర్మ  మరియు కళ్ళే వేణుగోపాల్ శర్మ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవనకొండ మరియు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నందు  సభ్యులు ప్రముఖ ప్రవచనాకర్త అందరూ పాల్గొనడం జరిగింది ఇందులో సండే సర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ జడ్జిమెంట్ కాపీలను ప్రతి దేవాలయమునకు ప్రతి పురోహితునికి ప్రతి చర్చిలకు మసీదులకు కూడా మీరు ఇస్తూ అక్కడ బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు అలాగే కొంతమంది మీరు జాతకం చూసేటప్పుడే మైనారు సంబంధాలు వచ్చినప్పుడు మీరు తప్పించవచ్చు ఏదో ఒకటి చెప్పి అన్నారు దానికి మేము అంగీకరించము బ్రాహ్మణుడు  ఎప్పుడు ఉన్న విషయం చెప్తాడు తప్ప అబద్ధం చెప్పడు కావాలంటే అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నాయి కాకపోతే ఒక గ్రహం చట్టం అనే గ్రహం నీకు అనుకూలంగా లేదని మటుకు చెప్పగలము బాల్య వివాహం నేరం అని కూడా చెప్పగలము ఇంకా దీనికి మించి వాళ్ళు మాపై ఏదైనా మాట్లాడితే మాకు ప్రొటెక్షన్ అనేది ఉండాలా కాబట్టి మీరు చట్టం నుంచి వచ్చిన కాపీని మాకు ఇస్తే అది చూపించుకోగలము అని మాట్లాడారు , దాని తర్వాత దేవుళ్ళ వసంత సాయి  మాట్లాడుతూ ఈ మధ్య పిల్లలకు పోయి మైనర్ పిల్లలపై ఈ సెల్ ఫోన్ లో ప్రభావం సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని సూచన చేశారు కోరారు తర్వాత, మన ప్రిన్సిపాల్  కళ్లే వేణుగోపాల్ శర్మ  మాట్లాడుతూ మేము చాలామంది కూడా కాలేజీల్లో ఎడ్యుకేట్ చేస్తున్నాము ఇంకా చేయగలుగుతున్నాము ఎన్నో కూడా అరికట్టగలిగాము ఇంకా మేము అరికట్టగలము ముఖ్యంగా పల్లెటూర్లలో అనాగరికత వల్ల నీరాక్షరసత వల్ల వారికి తెలియక ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయవలసిందిగా ఐసిడిఎస్ వారిని ఇంకా ఇతర డిపార్ట్మెంట్లను కూడా కోరారు అలాగే  సండేల్  మాట్లాడుతూ మేము దేవాలయాల్లో ఎలాంటి మైనర్ వివాహాలు చేయము ఒకవేళ మా బ్రాహ్మణుల దృష్టికి పురోహితుల దృష్టికి వచ్చిందంటే దాన్ని మేము చట్టం దృష్టికి అంటే పోలీస్ దృష్టికి ఇన్ఫామ్ చేయగలము అంతవరకే గానీ దానిపైన మేము ఎలాంటి బాధ్యత వహించమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులు కే మహేష్  వేద పండితులు అలాగే గురు రాజా చార్  పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *