ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కార్యక్రమం
1 min read
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధిత జాబితా పోస్టర్ విడుదల చేసిన జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి
జ్యూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలని ప్రజలకు సూచన
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతలపూడి శాసన సభ్యులు సాంగ రోషన్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి పాల్గొని సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధిత జాబితా పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదం తో ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువులను సింగిల్యూస్ ప్లాస్టిక్స్ ను వాడకుండా పర్యావరణానికి మరియు ప్రజా ఆరోగ్యానికి హాని చేయని జ్యూట్బ్యాగ్స్ & క్లాత్ బ్యాగ్స్ వాడాలని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువులను సింగిల్యూస్ ప్లాస్టిక్స్ ను వినియోగిస్తే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.ప్రతి యొక్క జిల్లా అధికారి తమ తమ కార్యాలయాలలోసింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదిత జాబితా పోస్టర్ ను ప్రదర్శించి పర్యావరణం పై సింగల్ యూజ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రభావం పడకుండా ఉండేలా తమ కార్యాలయ సిబ్బందిని సూచించాలని వారు కోరారు.కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూసింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసిన లేదా షాపులలో ఎక్కువ మొత్తం లో పట్టుబడిన వారిపై ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తగిన జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రతి ఒక్క జిల్లా అధికారికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి,ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు వారు సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిత పోస్టర్స్ ను ఇవ్వడంజరిగింది. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజలు, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు.