PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆజాదిక అమృత మహోత్సవాలు… మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : శ్రీశైలం కేంద్రంగా నడుస్తున్న చత్రపతి శివాజీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. స్థానిక మౌర్య ఇన్ హోటల్ పరిణయ ఫంక్షన్ హాల్ నందు శివాజీ మెమోరియల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆజాదిక అమృత మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో యువత, పిల్లలలో జాతీయ స్ఫూర్తి నింపే విధంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న విద్యార్థులకు దేశభక్తి రగిలించే విధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుల త్యాగాలను తెలిపే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి దశనుండే పిల్లల్లో శివాజీ ని స్ఫూర్తి తీసుకొని ధైర్య, సాహసలు పెంపొందించుకునేలా చేయాలని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రఘురామయ్య, సభ్యులు నాగేశ్వరరావు, మాంటిస్సోరి రాజశేఖర్, డాక్టర్ వాసిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author