PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడేళ్ల‌లో 21 వేల కోట్లు మోస‌పోయిన బ్యాంకులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ మోసాలను అధ్యయనం చేసే సలహా మండలి గడిచిన మూడేళ్లలో 139 బ్యాంకు మోసాల కేసులు వెలుగు చూసినట్టు తెలిపింది. వీటికి సంబంధించిన విలువ రూ.21,735 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. మాజీ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) టీఎం భాసిన్‌ ఏబీబీఎఫ్‌ఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెల్లడించిన మోసం కేసులను ఆర్‌బీఐ సహకారంతో ఏబీబీఎఫ్‌ఎఫ్‌ పరీక్షిస్తుంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు వెలుగు చూసినప్పుడు ముందుగా ఏబీబీఎఫ్‌ఎఫ్‌ విచారణ చేస్తుంది. అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందా? నేరపూరిత కోణాలు ఉన్నాయా? అని పరీక్షించిన తర్వాతే వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తుంది. సాధారణంగా రూ.50 కోట్లు అంతకుమించిన విలువైన కేసులను ఏబీబీఎఫ్‌ఎఫ్‌ తనిఖీ చేస్తుంది.

                            

About Author