విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉండండి..
1 min read
విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి..
మహానంది, న్యూస్ నేడు : వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా వర్షాలు కురుస్తాయని, విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహానంది మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీ దగ్గరలో కాని,మీ ఇంటిలో కాని ఎలాంటి విద్యుత్ పరికరాలను ఆరుబయట కరెంటు స్తంభాలను,తడి చేతితో తాకవద్దని తెలిపారు.రైతులు వర్షాల వల్ల పంటపొలాల్లో విద్యుత్ మోటార్లు నీటిలో మునిగి ఉంటాయని, స్టార్టర్ బాక్సులు తడిసి ఉంటాయని, రైతులు వాటిని ముట్టుకునే ప్రయత్నం చేయరాదన్నారు. పశువులను మేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,విద్యుత్ స్తంభాలకు కట్టరాదని, ఇంట్లో బట్టలను అరేసుకోవడానికి విద్యుత్తు తీగలను వాడరాదని తెలిపారు.ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ క్రింద ఉండరాదని,మీ కనుచూపు మేర ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే మీ ఏరియా కరెంటు ఆఫీసుకి కాని,మీ యొక్క లైన్ మెన్ కు సమాచారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని తెలిపారు. అప్రమత్తంగా లేకపోతే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని, విద్యుత్తు సమస్యలుంటే వెంటనే సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి కోరారు.