PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భగత్​సింగ్​ పోరాట స్ఫూర్తి..

1 min read
భగత్​ సింగ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న హసీనాబేగం

భగత్​ సింగ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న హసీనాబేగం

యువతకు ఆదర్శం..
– ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దేశాన్ని బ్రిటీష్‌ బానిస బంధనాల నుండి విముక్తి చేయడానికి సర్దార్‌ భగత్‌సింగ్‌ సహా రాజగురు, సుఖదేవ్‌ల స్ఫూర్తి.. నేటి యువతకు ఆదర్శమని ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం అన్నారు. ఆ ముగ్గురు యువ నేతలు దేశం కోసం ఉరికంభమెక్కారని, ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్య భారతదేశం.. నేడు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల చేతిలో నలిగిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట యోధుడు భగత్​ సింగ్​ 90వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భగత్​సింగ్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్​.హసీనాబేగం మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఈ నెల 26న చేపట్టే భారత్​ బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్​డబ్ల్యూపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author