PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ ఆస్తులు రూ. 4,847 కోట్లు.. రాజకీయ పార్టీల్లో టాప్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తుల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ సంస్థ దీనికి సంబంధించిన నివేదిక రూపొందించింది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల కేటగిరిలో జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్‌పీ రూ.618.86 కోట్లు ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్‌డీఆర్ డిపాజిట్ల పరంగా ఎస్‌పీకి రూ.434.219 కోట్లు ఉండగా, టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి.

        

About Author