PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొత్తుల పై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై స్పందించిన బీజేపీ

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్నికల్లో పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ పొత్తులపై బీజేపీ అధిష్టానంతో పవన్ మాట్లాడతారని చెప్పారు. అమిత్‌షా తమకు 2 నెలల క్రితమే రూట్ మ్యాప్ ఇచ్చారని, ఆయన ఆదేశం ప్రకారమే జనసేనతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గ ప్రభుత్వం నడుస్తోందని సోమువీర్రాజు విమర్శించారు. సీఎం జగన్ రూ.5 వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 20 లక్షల ఇళ్లు ఇస్తే.. వాటికి రూ.30 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు.. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. 2024లో జనసేనతో కలిసి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు.

                                    

About Author