PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టేలును బ‌లివ్వ‌బోయి.. మ‌నిషిని .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లాలో పండుగ పూట విషాధం చోటుచేసుకుంది. పొట్ట‌లును బ‌లిస్తుండ‌గా.. పొట్టేలును ప‌ట్టుకుని వ్య‌క్తి మ‌ర‌ణించాడు. మ‌ద్యం మ‌త్తే ఘ‌ట‌న‌కు ప్ర‌ధాన కార‌ణం. ఈ ఘ‌ట‌న మ‌ద‌న‌ప‌ల్లె స‌మీపంలోని వ‌ల‌స‌ప‌ల్లెలో జ‌రిగింది. స్థానిక ఎల్ల‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఆన‌వాయితీగా వ‌స్తున్న పొట్టేలు బ‌లి కార్య‌క్ర‌మానికి గ్రామ‌స్థులు సిద్ధం చేశారు. పొట్టేలును బ‌లిచ్చే వ్య‌క్తి అప్ప‌టికే మ‌ద్యం మత్తులో ఉన్నాడు. ఈ క్ర‌మంలో పొట్టేల‌ను బ‌లివ్వ‌బోయి.. పొట్టేల‌ను ప‌ట్టుకున్న వ్య‌క్తి పై వేటు వేశాడు. దీంతో సురేష్ అనే 35 ఏళ్ల వ్య‌క్తి అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

                                                

About Author