PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో నాటుబాంబుల కలకలం..

1 min read

గౌలికొండ పొలాల వద్ద నాటు బాంబు పేలి ఇద్దరి మహిళలకు గాయాలు

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో నాటు బాంబుల కలకలం రేపింది. పొలాల రక్షణ భాగంగా అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు పొలం దగ్గర పెట్టిన నాటు బాంబు పేలి ఇద్దరికి మహిళలకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పత్తికొండలోని గౌలికొండ పొలాల పనికి వెళ్లిన హసన్​బీ, బీబీ అనే మహిళలు… పొలం పనులు చేస్తుండగా  నాటుబాంబులు కంట పడ్డాయి. వాటిని తీసి వేసేందుకు బయటకు తీయగా… ఒక నాటు బాంబు పేలింది. దీంతో హసన్​బీ అనే మహిళకు ఎడమ చేతి నాలుగు వ్రేళ్లు తెగిపోయాయి. బీబీ అనే మహిళకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తికొండ సీఐ  ఆదినారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author