PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ  ప్రఖ్యాత ..బ్రదర్ సతీష్ కుమార్ ను కలిసిన టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు, కర్నూలు: కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ స్పీకర్ డాక్టర్ బ్రదర్ సతీష్ కుమార్ ను కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ కలిశారు. కర్నూల్ నగరానికి విచ్చేసిన సతీష్ కుమార్ ను ఓ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఆశీర్వాదాలు తీసుకునేందుకు సతీష్ కుమార్ ను కలిసినట్లు తెలిపారు. యేసు ప్రభువు ఆశీస్సులు తనపై ఉండేలా దీవించమని కోరినట్లు టిజి భరత్ చెప్పారు. మంచి చేసే వారికి ఎప్పటికి ప్రభువు ఆశీస్సులు ఉంటాయని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావు, రాజ్ కుమార్, సురేంద్ర, అజయ్, కిరణ్, దేవదాసు, తదితరులు పాల్గొన్నారు.

About Author