PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమా అఖిల ప్రియ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోద‌రుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ఫిర్యాదు చేశారు. నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వస్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్‌ను అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగారన్నారు. తన డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిలప్రియ గత నెల రోజుల నుంచి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు.

                                     

About Author