బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం
1 min read
అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
సృజనాత్మకతను వెలికి తీయడం,వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడటం పై శిక్షణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ,అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించడం జరిగింది. ఈనెల 24 నుండి 26 వరకు జరిగే మూడు రోజుల శిక్షణా కార్యక్రమంకు పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలలోని గణిత ఉపాధ్యాయులు హాజరవుతారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడం, వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడడం అనే అంశాల గురించి ఈ శిక్షణ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నుండి రేష్మ కృష్ణన్, అనంతపురం నుండి. పణి జ్యోతి ,ఏలూరు జిల్లా డి.సి.ఓ.ఉమా కుమారి, కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
