PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2500 మంది నేత‌ల పై కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రోన నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని 2500 మంది నేత‌ల పై ల‌క్నో పోలీసులు కేసు న‌మోదు చేశారు. బీజేపీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య.. ఎస్పీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభలో కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో లఖ్‌నవూ పోలీసులు పేర్కొన్నారు. వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, 270, 341 కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు గుమిగూడారని, ఇది కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు వెల్లడించారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నాయ‌కులు త‌దుప‌రి ఎన్నిక‌ల ర్యాలీల్లో పాల్గొన‌కుండా నియంత్రిస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

                                          

About Author