PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుల‌గ‌ణ‌న వివ‌రాలు వెల్ల‌డించాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్రం కుల గణన వివరాలను బహిర్గతం చేయాలని తెలంగాణ బిసి కమిషన్ డిమాండ్ చేసింది. కేంద్రం చేపట్టిన ఎస్.ఇ.సి.సి – 2011 బహిర్గతం చేసి అన్ని రాష్ట్రాలకు అందజేస్తే, రిజర్వేషన్లు న్యాయ పరిశీలనలో నిలబడతాయనే అభిప్రాయపడింది. కర్ణాటక రాష్ట్ర పర్యటనలో భాగంగా బెంగళూరు కు చేరుకున్నతెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సారధ్యంలోని టీమ్ శుక్రవారం బెంగళూరు చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ హెచ్. కాంతరాజ తో స్థానిక నాగురబావి లో ఉన్న అయన గృహంలో సమావేశం అయ్యింది.

                                

About Author