PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెన్త్ టాలెంట్ టెస్ట్ ని జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వెలుగోడు మండల వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది అని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కిషోర్ తెలిపారు ఈనెల 25న వెలుగోడు పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల వెలుగోడు లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోవాలని కోరారు అలాగే ఎంతోమంది విద్యార్థులు పబ్లిక్ అంటే భయం ఆందోళన చెందుతున్నారు ఈ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు పబ్లిక్ అంటే పరీక్ష అంటే భయం పోగొట్టే ప్రయత్నం చేస్తుంది అలాగే ఈ టాలెంట్ టెస్ట్ వల్ల విద్యార్థులు తమ సబ్జెక్టులు పట్ల ఎంతవరకు అవగాహన ఉంది అనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటారు ఈ టెస్టులో వంద మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుందని అందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం కూడా చేస్తామని తెలిపారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నవీన్ కుమార్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author