PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

11న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో 7వ తేదీ గురువారం సాయంత్రం ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈమేరకు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్​.జగన్​ ఈనెల 11వ తేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ బద్ధంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో సీఎం జగన్​ తిరుమల శ్రీవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ చైర్మన్​ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే అలిపిరి నడక మార్గాన్ని, ఎస్​విబీసీ కన్నడ ఛానల్​ను ముఖ్యమంత్రి వైఎస్​. జగన్​ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

About Author