PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మ‌కానికి ల‌గ‌డ‌పాటి కంపెనీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో గ్రూప్‌నకు ఉత్తరప్రదేశ్‌లోని అన్పరలో థ‌ర్మ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్ ఉంది. 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ జాబితా లో హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ , ఐల్యాబ్స్‌ గ్రూప్‌తో పాటు ఢిల్లీకి చెందిన హిందుస్తాన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. ల్యాంకో గ్రూప్‌ రుణదాతలు బకాయిల రికవరీ కోసం ఈ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టాయి. ఈ దివాలా పరిష్కార ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరిస్తున్న డెలాయిట్‌కు బిడ్లను తనిఖీ కోసం పంపాలని రుణదాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

                                 

About Author