PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన టి.ఎ.ఆర్.ఎల్ శిక్షణ

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: స్థానిక ఎంఈఓ కార్యాలయంలో 17వ తేదీ నుంచి, రెండు విడతల్లో 8 రోజులపాటు ఉపాధ్యాయులకు నిర్వహించిన టి.ఎ.ఆర్.ఎల్ శిక్షణ కార్యక్రమం, నేటితో ముగిసిందని బుధవారం నాడు ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు. ముగింపు సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ, ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలు విద్యార్థుల వరకు చేరాలని, స్థాయికి తగ్గ బోధన విద్యార్థులకు అందాలని, శిక్షణ యొక్క ప్రభావము బోధనపై ఉండాలని, సరళమైన బోధనా పద్దతలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో, సూక్ష్మ పద్ధతిలో బోధన జరగాలని సూచించారు.రెండు విడతల్లో 3,4,5 తరగతులు బోధిస్తున్న 74 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందాలని ఎంఈఓ తెలిపారు.కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎంఈఓ రామకృష్ణుడు, శిక్షకులు మహబూబ్ బాషా, నాగలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author