PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పరిశీలించి వాల్మీకులకు అవకాశం ఇవ్వండి

1 min read

టీడీపీ అధిష్టానం ముఖ్య నాయకులను కలిసిన ప్రజా సేవకుడు ఎల్లార్తి మల్లిఖార్జున

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి వాల్మీకి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ ముఖ్య నాయకులను నియోజకవర్గానికి చెందిన ప్రజాసేవకుడు ఎల్లార్తి మల్లికార్జున కలిసి అభ్యర్థించారు.ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని,టీడీపీ ముఖ్య నాయకుడు మాజీ MLC బీద రవిచంద్రలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి విన్నవించుకున్నారు.ఈసందర్భంగా ప్రజాసేవకుడు ఎల్లార్తి మల్లికార్జున మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలలో ఉన్నానని, అలాగే గత 20 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నానని తెలిపారు. నేను టీడీపీ పార్టీ తరఫున హాలగుంద జడ్పీటీసీ గాను, ఎల్లార్తి గ్రామ సర్పంచిగానూ పోటీ చేసిన అనుభవం ఉందని తెలిపారు. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా టీడీపీ తరఫున వాల్మీకులకు అవకాశం కల్పించలేదని ఈసారి ఆలూరు MLA సీటు వాల్మీకులకు కేటాయించి,తనకు అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానానికి విన్నవించుకున్నాని ఆయన తెలిపారు.

About Author