కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…
1 min read
నేరాల నివారణకు ప్రజలు సహకరించాలి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సిఐ మధు సుధన్ గౌడ్ , కర్నూలు సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది, హోంగార్డ్స్ తో కలిసి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని షరీన్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్స్ , ట్రబుల్ మాంగర్స్ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహన పత్రాలు సరిగా లేని 12 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. షరీన్ నగర్ ప్రజలతో నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్ మాట్లాడుతూ … నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. చట్టవ్యతిరేక , అసాంఘిక కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.